గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని అంబేద్కర్ నగర్ రాయన్న కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం సాయిలు చేతుల మీదుగా జరిగింది. కార్యక్రమానికి కాలనీ వాసులు ఉత్సాహంగా హాజరై జాతీయ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ కె బాబు, వెంకటేష్, రాజు, ఉప్పలయ్య, రమేష్ గుప్తా, మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, సురేష్, గున్న సంధ్య పాల్గొన్నారు. జాతీయ పండుగలను ఐక్యతతో జరుపుకోవడం అవసరమని వక్తలు పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని సూచించారు.
- Advertisement -
