Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్ముగిసిన పదో తరగతి పరీక్షలు

ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.టెన్త్‌ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్‌ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదలకానున్నాయి. ఓరియంటల్‌ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News