Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్AP: పీజీ వైద్య విద్య‌లో కొత్తగా 106 సీట్లు

AP: పీజీ వైద్య విద్య‌లో కొత్తగా 106 సీట్లు

ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యలో సీట్లు భారీగా పెరిగాయి. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాల్టీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా 106 సీట్ల (బ్రాడ్ స్పెషాల్టీ కోర్సులు) భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో 5 వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు 60 వరకు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,763 బ్రాడ్ స్పెషాల్టీ, 4 డిప్లొమా కోర్సు సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సీట్ల కేటాయింపు విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా మాట్లాడారు.

జనరల్ మెడిసిన్, గైనిక్ కోర్సుల్లో 20 చొప్పున!

కిందటేడాది చివర్లో కూటమి ప్రభుత్వం పీజీ వైద్య విద్యలో అదనపు సీట్ల మంజూరుకు అనుమతి కోరుతూ నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్‌(ఎన్ఎంసి)కి కళాశాలల వారీగా దరఖాస్తు చేసింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి తాజాగా వచ్చిన సమాచారంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి 106 సీట్లు కొత్త‌గా వ‌చ్చాయి. మొత్తమ్మీద జనరల్ మెడిసిన్ కోర్సులో 20, గైనిక్‌లో 20, పీడియాట్రిక్ 26, ఎనస్థీషియా 12, రేడియాలజీలో 4, ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లు ఎన్ఎంసి మంజూరు చేసింది.

కొత్త 5 కళాశాలలకు తొలిసారిగా

మచిలీపట్నం కళాశాలలో 12, నంద్యాల 16, రాజమహేంద్రవరం 16, విజయనగరం 12, ఏలూరు వైద్య కళాశాలలో 4 చొప్పున సీట్లు కొత్తగా ఎన్ఎంసి కేటాయించింది.

పాత కళాశాలల్లో

గుంటూరు మెడికల్ కళాశాలలో రేడియోలజీ 4, ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ 4, పీడియాట్రిక్‌లో 4 చొప్పున సీట్లు వచ్చాయి. అనంతపురం వైద్య కళాశాలకు 15, కడప 7, కర్నూల్ 4, శ్రీకాకుళం కళాశాలకు 8 చొప్పున సీట్లు అదనంగా వచ్చాయి.

తిరుపతి స్విమ్స్‌కు 13 సీట్లు

తిరుపతి స్విమ్స్‌కు మరో 13 పీజీ వైద్య విద్య‌లో సీట్లకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. ఎనస్తీషియా, ఈఎన్టీ, గైనిక్, ఆర్థో, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్ కోర్సుల్లో ఈ సీట్లు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News