Tuesday, February 24, 2026
HomeతెలంగాణYadadri | కన్నుల పండువుగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..

Yadadri | కన్నుల పండువుగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..

  • జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన నారసింహుడు..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్ష్మీనరసింహ స్వామికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. మంగళవారం నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

ఇవాళ రాత్రి ప్రధానాలయ తూర్పు మాడవీధుల్లో ఎదుర్కోలు ఉత్సవం జరుగనుంది. రేపు యాదగిరీశుడి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News