Saturday, October 4, 2025
ePaper
Homeఫోటోలునాగాయలంకలో జలయోగ కార్యక్రమం

నాగాయలంకలో జలయోగ కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జూన్ 19 గురువారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలయోగా నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది యోగా సాధకులు పాలుపంచుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం జలయోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పినట్లు కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. వీరికి గుర్తింపు ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో జల యోగాను ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వివరించారు. జల యోగాలో వికలాంగులు, పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొనటం గమనార్హం. యోగా చేస్తే అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News