అమెరికా ప్రత్యేక బలగాల అధికారి టెర్రెన్స్ జాక్సన్ (Terrence Jackson) బంగ్లాదేశ్లో హత్యకు గురికావటం అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని మోదీని హతమార్చేందుకు సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (CIA) పథకం వేసిందని, ఆ కుట్రను భగ్నం చేయటానికే ఇండియా, రష్యా సంయుక్తంగా టెర్రెన్స్ను చంపాయని ఇంటర్నేషనల్ మీడియా (International Media) పేర్కొంటోంది. అతను చనిపోయిన రోజు మోదీ చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russia President) కారులో సీక్రెట్గా చర్చించారని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత సింఘ్వీ లేటెస్ట్గా డిమాండ్ చేశారు. 2025 ఆగస్ట్ 31న ఢాకా()లోని ఒక హోటల్ గదిలో టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దక్షిణాసియాలో ముఖ్యంగా ఇండియాలో యూఎస్ నిఘా చర్యలపై సందేహాలకు దారితీసింది. ప్రధాని మోదీని టార్గెట్ చేసుకొని అతణ్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(Dhaka)లో మోహరించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనిపై సమాచారం అందటంతో ఇండియా, రష్యా జాయింట్ ఆపరేషన్ ద్వారా కుట్రను ఛేదించారని చెబుతున్నారు.
