- జిల్లా జడ్జి వి.బి నిర్మల గీతాంబా,
- జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి ఎం.సాయి కుమార్ ఆధ్వర్యంలో
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండా గిరిజన గ్రామంలో జిల్లా న్యాయ సహకార సేవ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి వి.బి నిర్మల గీతాంబా, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి ఎం.సాయి కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన తండాలలో గిరిజనులకు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం వాళ్లకు లభించాల్సిన హక్కులపై కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ప్రతి శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో లీగల్ అడ్వకేట్ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు జిల్లా జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూక్య సుశీల అధ్యక్షత వహించగా స్థానిక తహసిల్దార్ వెంకటస్వామి, స్థానిక ఎస్సై బి.ప్రవీణ్ గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
