తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)-2025లో భాగంగా మూడో రోజు పవర్ఫుల్ సెషన్(Powerful Session)తో ప్రారంభమైంది. “నిజ జీవితంలో స్థితిస్థాపకత” (Resilience in Real Life) అనే అంశంపై ఎమర్జింగ్ టెక్నాలజీస్(Emerging Technologies) అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

4 వేల మందికి పైగా విద్యార్థులు, వెయ్యి మందికి పైగా పౌరులు హాజరయ్యారు. దీంతో.. ఇది.. సమ్మిట్లో అత్యంత ఆకర్షణీయమైన సెషన్లలో ఒకటిగా ఇది నిలిచింది. ప్యానెల్ స్పీకర్లుగా జె.సత్యనారాయణ, జితేంద్ర పుచ్చ, శ్రీనివాస్ ఆత్రేయ, కిషోర్ ఉప్పలపాటి, జోగిందర్ తనికెళ్ల వ్యవహరించారు. వీళ్లు ఈ కింది అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవి..

- వేగంగా మారుతున్న సాంకేతిక వాతావరణాల్లో స్థితిస్థాపకతను పెంపొందించడం
- AI-ఆధారిత అంతరాయాలకు అనుగుణంగా మారడం
- నిజ-ప్రపంచ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం
- నాయకత్వం & సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం
- Advertisement -
