Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిRachakonda | పోలీస్ అమరవీరుల రుణం తీరనిది

Rachakonda | పోలీస్ అమరవీరుల రుణం తీరనిది

వారి త్యాగాలు వెలకట్టలేనివి
సంస్మరణ దినోత్సవంలో రాచకొండ సిపి

పోలీసు అరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ (Rachakonda) సిపి సుధీర్ బాబు ఐపిఎస్ గారు అంబర్ పేట కార్ హెడ్ క్వార్టర్ లో డీసీపీలతో కలిసి పోలీసు అమరవీరుల (Police Martyrs) స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి (Sympathy) తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర వాదుల చేతులలో అమరవీరులైన 16 పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులను సత్కరించి, వారి యొక్క మంచి, చెడులను తెలుసుకొని మేము ఉన్నామని బరోసా ఇచ్చినారు.

- Advertisement -

రక్తదాన శిబిరం ఏర్పాటు

అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్ లో అమరవీరుల జ్ఞాపకార్ధం రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి వందలాది పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి జ్ఞాపకార్ధంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మల్కాజిగిరి డిసిపి పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఐపిఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ విమెన్ సేఫ్టీ ఉషా రాణి, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ -1 శ్రీనివాస్, డీసీపీ ట్రాఫిక్ -2 శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసిపి లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News