తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) దామోదర్ రాజనర్సిహ (Rajanarsimha) ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (ప్రస్తుతం కామారెడ్డి జిల్లా) రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని (Kalabhairava Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు (Special Puja), అభిషేకాలు(Abhisheka) చేసి మొక్కులు చెల్లించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం (Grand Welcome) పలికారు. పూజల అనంతరం శాలువాతో సన్మానించారు. కాలభైరవ స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
- Advertisement -
