Tuesday, February 10, 2026
HomeతెలంగాణGovernor | ఐఎంఏ బ్లడ్‌ సెంటర్‌ ప్రారంభించిన తెలంగాణ గవర్నర్‌

Governor | ఐఎంఏ బ్లడ్‌ సెంటర్‌ ప్రారంభించిన తెలంగాణ గవర్నర్‌

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మరియు శాచి డి. భానుషాలి బ్లడ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ దిలీప్ భానుషాలి, తన దివంగత భార్య శాచి డి. భానుషాలి స్మారకార్థం ఈ ఆధునిక రక్త కేంద్రాన్ని స్థాపించేందుకు విశేషంగా సహకరించారు. ఈ బ్లడ్ సెంటర్‌ ఆధునిక సాంకేతికతతో, అత్యున్నత వైద్య ప్రమాణాలతో ఏర్పాటుచేయబడిందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం, రక్తసేకరణ, మరియు అత్యవసర వైద్య అవసరాల కోసం ఈ సెంటర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగపడనుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News