న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్(Rastrapathi Bhavan)లో జరిగిన 53వ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Suryakanth) ప్రమాణస్వీకార కార్యక్రమం(swearing-in ceremony)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీ కాలం విశిష్టంగా, ప్రభావవంతంగా సాగాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) నిన్న ఆదివారం పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఈ పదవిలో 2027 ఫిబ్రవరి వరకు ఉంటారు. హర్యానా (Haryana) నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తిగా నిలిచారు.

- Advertisement -
