- 5 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న వైనం..
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ఉండగా, టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు మాత్రం 5 శాతం పెరిగింది. ఇంట్రాడే గరిష్టం రూ. 49కి చేరింది. ఈ స్మాల్ క్యాప్ గత ఏడాది కాలంగా అదరగొడుతోంది. మల్టీబ్యాగర్ గా అవతరించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
టేక్ సొల్యూషన్స్ గ్లోబల్ ఏ.ఐ. డ్రివెన్ హెల్త్కేర్ సంస్థ. ఇది ఆంథ్రోపిక్ అడ్వాన్స్డ్ ఏ ఐ టూల్ క్లాడ్ ను తన సిస్టమ్లో ఇంటిగ్రేట్ చేసింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ ఏ ఐ టూల్ సాయంతో కంపెనీ కాంప్లెక్స్ మెడికల్, క్లినికల్, ఆపరేషనల్ డేటాను సురక్షితంగా, పెద్ద స్కేల్లో ప్రాసెస్ చేయగలదు. ఇది కంపెనీకి పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. ఇకపై స్కేలబుల్, ఇంటెలిజెంట్, ప్రివెంటివ్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్లు బిల్డ్ చేయడానికి టూల్ సహాయపడుతుంది.
టేక్ సొల్యూషన్స్ చైర్మన్ పరమేశ్వర్ ధంగారే మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్కేర్కు బేస్ అవుతోందన్నారు. క్లాడ్ ఏ ఐ ఇంటిగ్రేషన్ తమ టెక్నాలజీని బలపరుస్తుందని, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పెరుగుతుందని చెప్పారు. ఇన్నోవేషన్ వేగవంతమవుతుందన్నారు. ప్రిడిక్టివ్ మరియు ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్తో హెల్త్కేర్ను మార్చాలనేది తమ విజన్ అని వివరించారు.
