యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 30(ఆదాబ్ హైదరాబాద్): వైకుంఠ ఏకాదశి పర్వదిన (Vaikuntha Ekadashi Festival) సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లోని లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy)ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు(President of Telangana Rajyadhikari Party), ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Mlc Teenmar Mallanna) దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు(Special Puja) చేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన పాలన రావాలని భగవంతుణ్ని కోరుకున్నట్లు చెప్పారు.
దర్శనానంతరం ఆలయ పండితులు మల్లన్నకి వేదాశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కుల సాధనతోపాటు ప్రజల ఆశయాలను ప్రతిబింబించే రాజ్యాధికార పాలన లక్ష్యంగా తమ రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు.
