ఆత్మనిర్భర్ భారత్ అభియాన్(Atmanirbhar Bharat Abhiyan)లో భాగంగా రూపొందించిన “ప్రతి ఇంటా స్వదేశీ-ఇంటింటా స్వదేశీ” డోర్ స్టిక్కర్ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) విడుదల చేశారు. స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ (PM Modi) ఇటీవల పిలుపునిచ్చారు. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్(Trump Tariff)లకు ఇదే విరుగుడని పరోక్షంగా చెప్పారు. స్వదేశీ ప్రచారాన్ని బీజేపీ నేతలు ముందుకు తీసుకెళుతున్నారు. మన్ కీ బాత్(Mann Ki Baat)లో సైతం మోదీ స్వదేశీ ప్రస్తావన చేశారు.
- Advertisement -
