Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో శ్రీలత దేవులపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో శ్రీలత దేవులపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, కొంపల్లికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త శ్రీలత దేవులపల్లి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీలత దేవులపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీలత దేవులపల్లి మాట్లాడుతూ, “ఒక మహిళా పారిశ్రామికవేత్తగా, నా వ్యాపారంలో ఆధునిక సాంకేతికతను జోడించడం చాలా ముఖ్యం. తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా వ్యాపార కార్యకలాపాలలో సృజనాత్మకతను, సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చని నమ్ముతున్నాను. ఈ శిక్షణ నా వ్యాపారాన్ని భవిష్యత్తులో విస్తరించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

RELATED ARTICLES
- Advertisment -

Latest News