- హీరో సాయి సింహాద్రి
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు అశోక్ కుమార్, రామ సత్య నారాయణ రాజు, లైన్ వెంకట్, కన్నా రవి, రామకృష్ణ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
నిర్మాత, హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘సతీష్ గారు ‘సన్ ఆఫ్’ కథను నాకు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆయన చెప్పిన కథను విన్న తరువాత నా జీవితంలో జరిగినట్టుగానే ఉంది కదా అని అనిపించింది. యదార్థ ఘటనలతో ఈ మూవీని తెరకెక్కించారని కూడా చెప్పుకోవచ్చు. నాన్న మనకు క్రమ శిక్షణ, చదువు, సమయ పాలన వంటివి ఇస్తారు. డబ్బుని కాకుండా కష్టపడే తత్వాన్ని వారసత్వంగా ఇవ్వాలి. శోభా రాణి గారి వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను ఐదు థియేటర్లు అడిగితే శోభమ్మ నాకు 300 థియేటర్లు ఇచ్చారు. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. తండ్రీకొడుకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన చిత్రమిది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు.

నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ టైటిల్ చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో సినిమా ఉంటుందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. సాయి అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి ఓ గొప్ప సినిమా తీస్తుండటం మంచి విషయం. మీరా రాజ్ ఈ మూవీలో చక్కగా కనిపిస్తున్నారు. మంచి సెంటిమెంట్తో, ఎమోషన్తో ఫిబ్రవరి 27న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శోభా రాణి మాట్లాడుతూ .. ‘సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’ రిలీజ్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో సింహాద్రి నా వద్దకు వచ్చాడు. ఐదు థియేటర్లో రిలీజ్ చేస్తే చాలు అని సింహాద్రి అన్నాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అందరూ ఈ మూవీ కంటెంట్ చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. అన్ని భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నామ’ని అన్నారు.

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంతో పాజిటివ్గా షూటింగ్ కంప్లీట్ అయింది. అదే పాజిటివిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి సింహాద్రి, సతీష్ గారికి థాంక్స్. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత రామ సత్య నారాయణ రాజు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని శోభా రాణి గారు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరో మూవీని ఏ రేంజ్లో రిలీజ్ చేస్తారో.. అదే స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ తరువాత ‘సన్ ఆఫ్’ రేంజ్ మారిపోయింది. ఫిబ్రవరి 27న ఈ మూవీ పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రిషి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ఈవెంట్కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫిబ్రవరి 27న మా చిత్రం రాబోతోంది. నాకు ఇది తొలి సినిమా. నాకు ఈ అవకాశం ఇప్పించిన భాస్కర భట్ల గారికి థాంక్స్. సాయి సింహాద్రి గారు ఈ మూవీకి ప్రాణం పెట్టి పని చేశారు. ఆదిత్య మ్యూజిక్ మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త కన్నా రవి మాట్లాడుతూ .. ‘సాయి సింహాద్రి నిర్మించిన ఈ మూవీని శోభా రాణి గారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘సన్ ఆఫ్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ .. ‘శోభా రాణి గారు సినిమాల్ని అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ‘సన్ ఆఫ్’ చిత్రంలో సాయి సింహాద్రి గారు, మీరా గారు అద్భుతంగా ఉన్నారు. ఫిబ్రవరి 27న రాబోతోన్న ఈ మూవీని పెద్ద హిట్ చేయాలని ఆడియెన్స్ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రమా దేవి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. చిత్రాన్ని కూడా చూశాను. ఈ మూవీ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీ ఫిబ్రవరి 27న 300 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక రేర్ రికార్డ్. సాయి సింహాద్రి, మీరా జంట చూడముచ్చటగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత కరుణ లక్ష్మీ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నాన్న నట్టి కుమార్ గారు ఊర్లో లేరు. అందుకే నేను వచ్చాను. ‘సన్ ఆఫ్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘శోభా గారు ‘సన్ ఆఫ్’ మూవీని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆమె ప్రోత్సాహం వల్లే ఈ చిత్రం ఈ రేంజ్లో విడుదల అవుతోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ దర్శకుడు చరణ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని నేను చూశాను. ఈ సినిమా చాలా బాగుంది. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సూరీడు’ రేంజ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ వేణు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ సినిమాని నేను చూశాను. నైజాంలో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సాయి సింహాద్రి, శోభా రాణి గారి వల్లే ఈ సినిమా నాకు వచ్చింది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుంది’ అని అన్నారు.
పూర్ణిమ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ కోసం సాయి సింహాద్రి చాలా కష్టపడ్డారు. ఎంతో పర్ఫెక్షన్తో పని చేస్తుంటారు. మూడు వందల థియేటర్లలో రిలీజ్ అవుతుండటం మామూలు విషయం కాదు. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని మాకు ఇచ్చినందుకు థాంక్స్. ఇప్పటికే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
