ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Joint Adilabad District) నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే(MLA), బీజేఎల్పీ నేత (BJLP Leader) ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. మామడ, లక్ష్మణ్ చందా మండలాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా శాసన సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. లక్ష్మణచందా మండలం తీర్పెల్లి గ్రామ సర్పంచ్ బొమ్మన గిరిజ రవి, ఉప సర్పంచ్ ఐలాపురం ప్రవీణ్ని అభినందించారు (Congratulates). ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మామడ మండలం రాయదారి గ్రామ సర్పంచ్ బంక తిరుపతి, ఉప సర్పంచ్ రాథోడ్ గంగు గంగారామ్ను శాలువాతో సత్కరించారు.
