హైదరాబాద్ లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్(Palamoor Agro Complex Limited) డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డిని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్లో ప్రమోటర్లకు(Promoters) తెలియకుండా నకిలీ డాక్యుమెంట్ల(Fake documents), సంతకాలతో సంస్థకు చెందిన 100 ఎకరాల భూమి (విలువ రూ.300 కోట్లు)ను విక్రయించినట్లు ఆరోపించారు. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై(arrest warrant) చర్య తీసుకున్న అధికారులు రమేశ్ను జ్యుడీషియల్ రిమాండ్కు(Judicial remand) తరలించారు.
- Advertisement -
