- రహదారులు అక్రమిసై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్ సుదాంషు
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి జోన్ లో జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు రహదారి ఆక్రమణలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వ్యాపారం సముదాయాల వద్ద రహదారులను ఆక్రమించి ఏర్పాటుచేసిన షెడ్డులతో పాటు నిర్మాణాలను జెసిబి తో కూల్చివేశారు. ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదని సర్కిల్ కమిషనర్ సుదాంషు హెచ్చరించారు. కూల్చివేతల్లో పట్టణ ప్రణాళిక అధికారి సుకన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
