సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్(CII Partnership Summit)పై ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నాను. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని ప్రకటించారు. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువత(Youth)కు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండా(Agenda)గా పెట్టుకున్నామని అన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of doing business) విధానాల వల్ల పెట్టుబడులను (Investments) ఆకర్షిస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెప్పారు. ‘ఒకటి.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని వివరించారు. వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ఈ సందర్భంగా వివరించాను.
