కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రేపు(సోమవారం) ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 29వ తేదీ నుండి యధాతధంగా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
- Advertisement -
