గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) పరిధితోపాటు రాష్ట్రంలోని పెద్ద టౌన్ల(Towns)లో కూడా పేదలందరికీ(Poor People) G+3 తరహాలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Indlu) నిర్మాణాలు చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) శాసన సభ(Assembly)లో శనివారం చెప్పారు. గత పాలకులు ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చి విస్మరించారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) దత్తత తీసుకున్న వాసాలమర్రిలోనూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచనతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చి ఇచ్చిందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో 400 నుంచి 600 sft వరకు ఉన్న నిబంధనలను ఇప్పటికే సడలించామని తెలిపారు.
- Advertisement -
