ఇటీవల జరిగిన కరీంనగర్ మున్సిపల్ నగర పాలక సంస్థ ఎన్నికలలో గెలుపొందిన పద్మశాలి కార్పొరేటర్లను కొత్తపల్లి పద్మశాలి సంఘం , కొత్తపల్లి మార్కండేయ దేవాలయ అభివృద్ధి కమిటీ కొత్తపల్లి పద్మశాలి యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు అయిన వాసాల రమేష్ వేముల కవిత చంద్రశేఖర్ చొప్పరి జయశ్రీ తెల్ల లక్ష్మి రమేష్ దేవసాని సరస్వతి సత్యనారాయణ మాసం గణేష్ లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు . కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం పద్మశాలి సంఘం ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం పోప అధ్యక్షులు పోలు సత్యనారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరైనారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వల్లాల కృష్ణహరి మాజీ కౌన్సిలర్ స్వర్గం వజ్ర నర్సయ్య కొత్తపళ్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు కంఠం రాజేశం మార్కండేయ దేవాలయం అధ్యక్షులు అనుమల సత్యనారాయణ యువజన సంఘం అధ్యక్షులు వేముల సాగర్ ఇప్పనపల్లి సాంబయ్య అల్సభద్రయ్య జక్కని సంజయ్ వడ్నాలరవీందర్ వేముల విష్ణు దికొండ లక్ష్మీనారాయణ డాక్టర్ స్వర్గం శంకరయ్య భోగ మునిందర్ స్వర్గం శ్రీనివాస్ పెద్ది దామోదర్ నడిమెట్ల రాజు పద్మశాలి కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
