నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా( Om Birla)ను పార్లమెంట్(Parliament)లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్(Arvind Dharmapuri Foundation-ADF) ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. 175 మందికి పైగా చిన్నారుల ప్రాణాలను కాపాడిన విధానాన్ని, నిజామాబాద్లో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల (BJP Booth Committee Members) కోసం ADF చేస్తున్న సేవలను స్పీకర్ అభినందించారు. ఈ నేపథ్యంలో ఓసారి నిజామాబాద్ రావాలని ఎంపీ.. ఓం బిర్లాను ఆహ్వానించగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
- Advertisement -

