కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్స్ చట్టాల పత్రాలు దహనం చేశారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నఈ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పని భద్రత కల్పించి, టెక్నాలజీ పెరిగిన తరుణంలో కార్మికులకు 12గంటల పని సమయాన్ని తగ్గించాలని కోరారు.

- Advertisement -
