జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా విజయం సాధించిన నవీన్ యాదవ్ పలువురు ప్రముఖులను (Important Persons) మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన సభ స్పీకర్ (Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)ను, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.కేశవరావు (K.Keshava Rao)ను, హైదరాబాద్ మేయర్ (Hyderabad Mayor) గద్వాల విజయలక్ష్మి (Gadwala VijayaLaxmi)ని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (Hyderabad City Police Commissioner) విశ్వనాథ్ చెన్నప్ప (వీసీ) సజ్జనార్(VC Sajjanar)ను కలిశారు.

ఈ సందర్భంగా వారు నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు తెలిపారు. మీలాంటి యువత మరింత మంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ప్రశంసించారు. నవీన్ యాదవ్ స్పందిస్తూ.. పెద్దల ఆశీర్వాదాలు తనకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు.

