అమెరికాలో జరిగిన రహదారి ప్రమాదంలో మంచిర్యాల తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. మృతులది మంచిర్యాల టౌన్లోని రెడ్డి కాలనీ అని స్థానికులు చెప్పారు. రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పి.విఘ్నేష్ ఇద్దరు కూతుర్లు స్రవంతి, తేజస్వి యూఎస్లో సెటిల్ అయ్యారు. తేజస్వి ఇంట్లో శుభకార్యం కోసం సెప్టెంబర్ 18న విఘ్నేష్ దంపతులు అక్కడికి వెళ్లారు. అక్టోబర్ 17న పెద్ద బిడ్డ కొడుకు నిశాంత్ పుట్టినరోజు వేడుక కోసం విఘ్నేష్, ఆయన భార్య రమాదేవి కారులో వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి, తేజస్వి చనిపోగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
- Advertisement -
