నర్సాపూర్ (జి)లోని సంతలో తప్పిపోయిన 4 ఏళ్ల బాలుడిని మహిళా పోలీసులు షహనా బాను, వినిత చాకచక్యంగా రక్షించారు. బుధవారం మార్కెట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలుడి వద్ద వివరాలు సేకరించి, తల్లిని పిలిపించి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన మహిళా పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
