- నిర్వహించిన రాష్ట్ర మంత్రి సీతక్క
- మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు…
- రేపు సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరే సమయానికికొలువుదీరనున్న పగిడిద్దరాజు
మేడారం జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం పూనుగొండ్ల గ్రామంలో ని పగిడిద్దరాజు కు ఆదివాసీ సాంప్రాయాల పద్ధతిలో ప్రత్యేక పూజలు చేయగా రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క హాజరై ఆలయం వద్ద డోలు సన్నాయి వాయిద్యాల మధ్య గిరిజన మహిళలతో తమకు చెందిన సాంప్రదాయ నృత్యం చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి,కొత్తగూడెం గంగారం మండలాల అధ్యక్షులు వజ్జే సారయ్య,జాడి వెంకటేశ్వర్లు,పలు గ్రామాల్ సర్పంచులు, మండల నాయకులు, పూజారులుతదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
