- శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇస్తాయి..
ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తీసుకోవడం, శరీరాన్ని సిద్ధం చేయడం అవసరంగా మారింది. చాలా మంది తీసుకునే ఆహారం శరీర అంతర్గత ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడంతోపాటు, రికార్డు స్థాయిలో పెరుగుతున్న వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. భారతీయ వేసవి కాలాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా జొన్నలు, రాగులు వంటి మిల్లెట్లను ఆహారంలో చేర్చడం అవసరం.
ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు, మాక్రో, మైక్రో పోషకాలతో శరీరాన్ని పోషిస్తాయి. అంతేకాకుండా వేసవిలో మిల్లెట్ల వినియోగం పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఇవి తక్కువ కాలంలో పెరిగే పంటలు కావడంతోపాటు, తక్కువ నీటితో పెరుగుతాయి. పోషకాల సమృద్ధిగా ఉన్న ఈ ధాన్యాలు వేడిని తగ్గించడంలో సహాయపడటంతో పాటు, వేసవిలో సాధారణంగా కనిపించే అలసట సమస్యను కూడా తగ్గిస్తాయి.
