దేశానికి 10 సంవత్సరాలు సీఆర్పీఎఫ్ లో సేవలందించిన మెఘవత్ రమేష్ నాయక్, గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో రంగారెడ్డి జిల్లా, మంచాల్ మండలం లోయపల్లి గ్రామ ప్రజల ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ తరఫున బరీలో ఉన్నారు..
ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన రమేష్ నాయక్, బ్యాట్ గుర్తుపై తమకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి తమ ఏకైక లక్ష్యమని, ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ప్రజలతో కలిసి పారదర్శకంగా గ్రామాభివృద్ధికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
