హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జన్మదినం సందర్భంగా తొర్రూరు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ కోఆర్డినేటర్ డా. ఎం.ఎస్. అన్సారి, యువనేతలతో కలిసి ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలసి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించారు.