Sunday, October 5, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో కుర్రి దిలీప్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో కుర్రి దిలీప్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

కామారెడ్డి జిల్లా, రామారెడ్డికి చెందిన ఫార్మాస్యూటికల్ ఉద్యోగి (క్వాలిటీ అస్యూరెన్స్ విభాగం) కుర్రి దిలీప్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కుర్రి దిలీప్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా కుర్రి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, “ఫార్మాస్యూటికల్ రంగంలో, ముఖ్యంగా క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో కచ్చితత్వానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా నా వృత్తిపరమైన నైపుణ్యాలు మరింత మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా విధులను మరింత సమర్థవంతంగా, సృజనాత్మకంగా నిర్వహించడానికి ఎంతగానో దోహదపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

RELATED ARTICLES
- Advertisment -

Latest News