Tuesday, February 10, 2026
Homeకరీంనగర్ఆడబిడ్డ కి కోదురుపాక సర్పంచ్ భరోసాపథకం ప్రారంభం.5 వేలు జమ

ఆడబిడ్డ కి కోదురుపాక సర్పంచ్ భరోసాపథకం ప్రారంభం.5 వేలు జమ

బోయినపల్లి మండలం లోని కోదురపాక సర్పంచ్ కత్తెరాపాక మంజుల సుధాకర్ గురువారం ఆడబిడ్డ కి కోదురుపాక సర్పంచ్ భరోసా పథకం ప్రారంభించారు. ఈ పథకం లో భాగంగా 5 వేల రూపాయలను పుట్టిన ఆడబిడ్డ పేర పోస్టాఫీసులో సుకన్య సంవృద్ధి పథకం క్రింద అకౌంట్ తీసి జామచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో మేము ప్రజలకు ఇచ్చిన హామీ లో భాగంగా నేడు ఈ పథకం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది అని అన్నారు. మేము సర్పంచ్ గెలిచినా నుండి మా గ్రామంలో పుట్టే ఆడబిడ్డ కి మేము సుకన్య సంవృద్ధి పథకం పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసి అందులో 5000/- జమ చేయటం జరుగుతుంది. ర్యాకం గౌతమి-తిరుమలేష్ గార్ల కూతురి పైనా ఈ రోజు పథకం మొదలు పెట్టాము.

ఈ అకౌంట్ లో తల్లిదండ్రులు వారికీ వీలును బట్టి డబ్బులు వేసుకుంటూ పోతే, ఉన్నత చదువుల చేసే టైం లో లేదా పెళ్లి చేసే సమయానికి ఆర్థికంగా తోడుగా ఉంటుంది. ఈ కార్యకమంలో వార్డ్ సభ్యులు అన్నాళదాస్ భాస్కర్, బలాగోని శ్రీనివాస్, సమతా, నాగుల లావణ్య, రవివర్మ, గ్రామభివృద్ధి నాయకులు బండి శ్రీను, నాగుల నాగరాజు, వంశీ, అంజయ్య, దేవయ్య, మురళి, సత్యనారాయణ రావు, రవి, కమల్, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News