కీసరగుట్ట బ్రహ్మోత్సవ జాతర పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గుట్టపైన పారిశుద్ధ్య పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి.కీసరగుట్టపైన గల మరుగుదొడ్ల సమీపంలో మురుగు పారుతుంది. ఈ నెల 13 నుండి జాతర ప్రారంభమవుతున్నా గానీ ఇంకా చదవ పందిళ్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేయవలసిన నీటి ట్యాంకుల మరమ్మత్తుల పనులు పట్టించుకునేవారు లేరు. జాతర సమీపిస్తున్నా గాని పనుల్లో వేగం లేకపోవడంతో కీసరగుట్ట జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.



- Advertisement -
