అబ్దుల్లాపూర్మెట్, జనవరి 22(ఆదాబ్ హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి(Abdullapurmet Mandal Kavadipalli) 3వ వార్డ్ సభ్యుడు బండారి సురేష్(Bandari Suresh) హఠాన్మరణం(Sudden Death) చెందారు. గుండెపోటు రావటంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సురేష్ కుటుంబ సభ్యులు(Family Members) శోకంలో మునిగిపోయారు. ‘నువ్వు లేని లోటు మాకు ఎప్పటికీ తీరనిది. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’ అని కవాడిపల్లి ప్రజలు సురేష్కి శ్రద్ధాంజలి(Shraddanjali) ఘటిస్తున్నారు.
- Advertisement -
