ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Accreditation cards) గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించారు. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు లేదా కొత్త కార్డులు జారీ చేసే వరకు ఏది ముందైతే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సమాచార పౌర సంబంధాల శాఖ (I and PR Department) సంచాలకులు కే.ఎస్. విశ్వనాథన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నవంబర్ 30 వరకు అక్రిడిటేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. అయితే.. పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలల పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు తెలిపారు.
- Advertisement -
