- దేశవ్యాప్తంగా ఈనెల 21, 22, 23, 24, వరకు జరుగనున్న పరీక్షలు..
- ఈనెల 29న పేపర్ – 2 పరీక్షతొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల
- నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు..
- రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలవరకు నిర్వహణ..
దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24 సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్ష, 29న పేపర్-2 పరీక్ష జరగనున్నాయి. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజుల అడ్మిట్ కార్డులను విడుదల చేయగా.. 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేయనున్నారు. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
jeemain. nta. nic.in వెబ్సైట్లో ఈ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.. ముందు jeemain.nta nic.in వెబ్సైట్కు వెళ్లాలి. హెూంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2026 సెషన్-1కు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనబడుతుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకోవచ్చు. కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఏదైనా సమస్య ఉంటే యివవమొఱఅఏఝ.ఎ. ఱఅ ద్వారా ఎన్టీఏకు ఫిర్యాదు చేయొచ్చు.

