- పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.
కార్తీక మాసం పురస్కరించుకొని మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గల జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం, లక్ష దీపోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలరాజు యాదవ్, వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్ రెడ్డి, నిరంజన్, జి ఎన్ వి. సతీష్ కుమార్, మిరియాల రామచందర్, కొమురయ్య, లక్ష్మణ్, సంపత్ గౌడ్, సిరిగిరి రాజు, పార్ధు, జంగాల శ్రీరామ్ యాదవ్, ఫరీద్, పీవీ. సత్యనారాయణ వెంకట్, రాజు, తోపాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
