మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ సేవలు మరువలేనివని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి మండల పార్టీ ఆధ్వర్యంలో పూలమాల ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వస్తున్నట్లు తెలుపుతూ,దేశానికి చేసిన సేవలపై కొనియాడారు. అనంతరం పండ్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్, ఇస్తారు శేఖర్, మార్కెట్ డైరెక్టర్ జ్యోతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సురేష్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, VFG చైర్మన్ శ్రీనివాస్, మండల కార్యదర్శి జెట్టి రామూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిని మహేష్, ఎరుకల రవీందర్, బుంపల్లి శ్రీనివాస్ ,దూలపెల్లి రవీందర్ రావు, జరప్పుల రమేష్, వక్కల శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
