నేడు సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకు ఓనమాలు దిద్దే వయసులో, కంప్యూటర్లు చేత బట్టిస్తున్నారు. చందమామ కథలు చెబుతూ, గోరుముద్దలు తినిపించే ఆనాటి రోజులు మాయమవుతున్నాయి, మనుషులతో బంధాలు వీడి, టెక్నాలజీతో ముడిపడిపోతున్నారు. పట్టు మని అయిదారు ఏండ్లు అయినా రానిదే.. ఈ పోటీ ప్రపంచంలో అడుగేస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. పక్షిలా విహరించాల్సిన బాల్యంలో, పుస్తకాల మధ్య బంధించబడ్డారు. ఎనుకటి ఆ రోజులే బాగుండేవి.. ఇంటర్నెట్ తెలీని కాలం యాదికొస్తున్నది.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలతోగడిపే కాలం…
- బి సి. అనిల్ కుమార్
- Advertisement -
