సారంగాపూర్ మండలం జామ్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎస్సై శ్రీకాంత్ బుధవారం పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తి నావత్ గణేష్ ను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ ను తదుపరి చర్యల నిమిత్తం తహసిల్దార్ కు అప్పగించారు. అక్రమ ఇసుక రవాణా గురించి తెలిసిన ప్రజలు డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
- Advertisement -
