ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని(Pre-Primary Education System) అమలుచేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి(Himachal Pradesh Education Minister) రోహిత్ ఠాకూర్(Rohit Thakur) నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి తెలిపారు.
✅ హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
✅ జాతీయ విద్యా విధానం(National Education Policy) తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్న విషయాన్ని తెలిపారు. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.
✅ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు.
✅ రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలు(ITIs to ATCs)గా తీర్చిదిద్దుతున్న వివరాలను, ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.
✅ విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతున్న సంస్కరణలతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(YIIRS) ఏర్పాటుచేస్తున్న వివరాలను తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్ను నిర్మిస్తున్నట్టు చెప్పారు.
✅ ఏటీసీగా మార్చిన మల్లేపల్లి(ఐటీఐ)ని సందర్శించాలని ఈ సందర్భంగా సీఎం హిమాచల్ప్రదేశ్ మంత్రికి సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపైన ఆసక్తి చూపించిన హిమాచల్ప్రదేశ్ మంత్రి అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు.
✅ ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న సీఎం రేవంత్ విజన్ను రోహిత్ ఠాకూర్ అభినందించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM Revanth | రేవంత్తో హిమాచల్ప్రదేశ్ మంత్రి భేటీ
- Advertisement -
RELATED ARTICLES
