- తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- ఆయన అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు..
- తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా..
తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా, వాటిని రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
- Advertisement -
