Sunday, October 26, 2025
ePaper
HomeజాతీయంDefence | రూ.79 వేల కోట్ల రక్షణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

Defence | రూ.79 వేల కోట్ల రక్షణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ శాఖ ముఖ్య నిర్ణయం తీసుకుంది. రూ.79 వేల కోట్ల ఖర్చుతో ఆయుధాలు, సైనిక పరికరాలను కొనేందుకు అనుమతించింది. నాగ్ క్షిపణి వ్యవస్థ (NAMIS), టార్పిడోలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు తదితరాలను కొంటారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన భేటీ అయిన డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్(DAC) ఈ ప్రతిపాదనలను ఓకే చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఇది రెండో అతిపెద్ద నిర్ణయం కావటం విశేషం. గతంలో రూ.67 వేల కోట్ల ప్రతిపాదనలను ఆమోదించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News