కార్తిక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు దుస్తులకు మంటలు అంటుకుని బాలిక మృతిచెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబంతో కలిసి రాంపల్లి ఆర్ఎల్ నగర్లో నివాసం ఉంటున్నాడు.
ఆయన కుమార్తె సాయినేహా రెడ్డి(7) బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగిస్తుండగా దుస్తులకు మంటలంటుకొని 90 శాతం కాలిన గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
- Advertisement -
