Monday, March 23, 2026
Homeరంగారెడ్డిMedical Camp | వైద్య శిబిరంతో మహిళలు పిల్లలకు ఆరోగ్య భరోసా

Medical Camp | వైద్య శిబిరంతో మహిళలు పిల్లలకు ఆరోగ్య భరోసా

  • వైద్యు నారాయణ, డాక్టర్ కృష్ణ ప్రసాద్.

వైద్యు నారాయణ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నవీన. మనీ మేఘలై డాక్టర్లు. రవళి. సాయి ప్రియ. అన్షు. విజయ. సుకన్య. ఆయు సేవా సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఒకటవ విభాగం మాజీ నగరపాలక సభ్యుడు యువరాజ్ నాయకత్వంలో జరిగిన ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త దొంతగాని కోటేష్ గౌడ్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు.

సమాజంలో వెనుకబడిన ప్రాంతాల్లో మహిళలు పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దగ్గరగా చూసినప్పుడు వారి కోసం ఏదో చేయాలనే ఆలోచన బలంగా ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య సేవలు ఉన్నప్పటికీ అవి అందరికీ చేరకపోవడమే అనేక ఇబ్బందులకు కారణమవుతోందని పేర్కొన్నారు. ఈ అంతరాన్ని తగ్గించి ప్రతి మహిళ ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా గౌరవంగా జీవించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

- Advertisement -

ఈ లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలు ప్రధానంగా గర్భిణీ మహిళలు పిల్లలు మహిళల స్త్రీరోగ సమస్యలపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. గ్రామీణ సమాజానికి కేంద్రబిందువులైన అంగన్వాడీ కేంద్రాల్లోనే వైద్య సేవలు అందించడం వల్ల మహిళలకు సులభంగా భద్రంగా చికిత్స లభిస్తున్నదని తెలిపారు.

శిబిరంలో వైద్య పరీక్షలు మాతా శిశు ఆరోగ్య పరిశీలనలు పోషకాహారంపై మార్గదర్శకత అందించారు. కేవలం పరీక్షలతో పరిమితం కాకుండా మహిళలు పిల్లలు గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళలకు ధైర్యం పిల్లలకు ఆరోగ్యమైన ఆరంభం కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు వైపు ఒక అడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు అన్నారు. ఆయు సేవా సంస్థ ఈ తరహా శిబిరాల ద్వారా సమాజాన్ని మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నపిల్లలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News