కాకినాడ(Kakinada)లో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్(AM Green Hydrogen, Green Ammonia Plant)కు సీఎం చంద్రబాబు(CM Chandrababu) శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వచ్చారని చెప్పారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయని తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
- ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును మన రాష్ట్రంలో ఏర్పాటుచేయటం సంతోషదాయకం
- ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు
- గతేడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతిచ్చాం.
- 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
- చరిత్ర తిరగరాయటం తెలుగువాళ్ల(Telugu People) వల్లే సాధ్యమవుతుందని మరోమారు నిరూపితమవుతోంది
- కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా.. జర్మనీ(Germany)కి సరఫరా అవుతుంది
- గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్(Nagarjuna Fertilizers) చేపట్టింది.
- ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియాతో పర్యావరణహిత ఉత్పత్తులు తయారవుతాయి
- పర్యావరణ సమతుల్యత సాధించటమే ప్రస్తుత లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయి
- ప్రకృతి విపత్తులు, సముద్ర మట్టాలు పెరగటం వల్ల భూమి కోతకు గురవుతోంది.
- ప్రధాని మోదీ 500 గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు
- ఆయన లక్ష్యాన్ని అందిపుచ్చుకొని ఏపీలో 160 మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం
- సమీప భవిష్యత్తులోనే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుతుంది.
- సౌర ఫలకాలను ఇళ్లపై ఏర్పాటుచేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారులు ప్రొడ్యూజర్లుగా మారారు
- సన్ రైజ్ ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీర రేఖలో 20 పోర్టులు రాబోతున్నాయి
- సౌర, పవన, జల, పంప్డ్ స్టోరేజీ లాంటి విద్యుత్ ఉత్పత్తికి, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రం ఏపీ
- ఏఎం గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఇథనాల్, గ్రీన్ మాలిక్యూల్స్ లాంటి ఉత్పత్తులు వస్తాయి
- గ్రీన్ ఎనర్జీ గురించి చర్చ వస్తే ప్రపంచవ్యాప్తంగా కాకినాడ పేరు వినిపిస్తుంది.
- డీ కార్బనైజేషన్ గురించి అంతా మాట్లాడుతున్నాం గానీ యూరోప్ ఈ రంగంలో ముందుంది
- కాకినాడలోనే 2 గిగా వాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రోలైజర్స్ తయారీకి నిర్ణయించటం అభినందనీయం
- ఏపీ క్లీన్, గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ 2024 దేశంలోనే అత్యుత్తమ విధానం
- పారిశ్రామిక రంగానికి అనుకూలమైన విధానాల ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావటమే మా ప్రభుత్వ లక్ష్యం
- ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తున్నాం
- గ్రీన్ అమ్మోనియా ద్వారా ప్రకృతి సేద్యానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది
- ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల నీటిలో నైట్రోజన్ స్థాయిలు, సెలినీటి ఎక్కువ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉంది
- గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది.
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అభివృద్ధి జరగాలి, సంపద రావాలి. తద్వారా సంక్షేమం జరగాలి
- 18 నెలల్లో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసి సంక్షేమంలో రికార్డు సాధించాం
- ఏపీపై నమ్మకం ఉంచి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయి.
- రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు భారాన్ని రూ.1.19 పైసలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం
- ఇప్పటికే యూనిట్కు 29 పైసల మేర భారాన్ని వినియోగదారులపై తగ్గించాం.
- ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా తగ్గించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి
- విశాఖకు 1 గిగా వాట్ సామర్ధ్యంతో ఏఐ గిగా సెంటర్ ఏర్పాటుచేసేందుకు గూగుల్ ముందుకు వచ్చింది
- గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటం వ్యాలీ కూడా ప్రకటించి ఆధునిక భవిష్యత్కు నాంది పలికాం
- వచ్చే 6 నెలల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభమవుతాయి
- రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ లాంటి సాంకేతికతపై కూడా పెద్దఎత్తున పురోగతి సాధిస్తాం
- సంపద సృష్టికి ఏపీని మించిన అత్యుత్తమ గమ్యస్థానం మరొకటి లేదు
- భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా మారుతుంది
- గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలి
- ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మెగా ప్రాజెక్టుకు ఇంత వేగంగా శంకుస్థాపన నిర్వహించటం అభినందనీయం
- 2029-30 నాటికి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారాలని ఆకాంక్షిస్తున్నా
- రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది
- Advertisement -

