జీవితంలో ఎప్పుడు కూడా ఒక మనిషి అందరినీ ఒప్పించాలని ప్రయత్నం చేయకూడదు.. అందరికీ నచ్చాలని కోరుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది.. అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం.. అజ్ఞానం.. అల్పత్వం.. ఎందుకంటే ఒక వేలు పొట్టి, ఒక వేలు పొడవు.. ఇలా ఉన్నంత మాత్రాన వాటి విలువలు ఎప్పటికీ మారవు. వాటి ప్రత్యేకత వాటికి ఉంటుంది.. అక్షరం రాయాలన్నా, అన్నం తినాలన్నా ఐదు వేళ్ళూ కలవాల్సిందే…ఇక మనుషులు కూడా అంతే…చిన్న.. పెద్ద అనే తేడా వద్దు.. ఉండకూడదు కూడా.. ఎవరి ప్రాముఖ్యం వారిదే..అలా అందరూ కలిస్తేనే సమాజం అవుతుంది..
- Advertisement -
